27-09-2024 NORMAL NEWS 01:01 AM
swarnodayam.com
Telugu Daily News
27-09-2024 01:01 AM By Mandala Yadagiri

హుజురాబాద్ సబ్ కోర్టు పిపి గా రాజిరెడ్డి.

హుజురాబాద్ సబ్ కోర్టు పిపి గా రాజిరెడ్డి.
IMG-20240927-WA0062

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ (సబ్ కోర్టు ) అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గౌరు రాజిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టులో అడిషనల్ పిపి గా ఉన్న శరత్ ను పదోన్నతిపై కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేసారు. కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పీపీ గా ఉన్న రాజిరెడ్డి ని ఇక్కడ ఇంచార్జ్ గా నియామకం జరిపారు. కరోనా సమయంలో రాజిరెడ్డి ఇంచార్జ్ అడిషనల్ పీపీ గా ఇక్కడ ఏడాదిన్నర పాటు పనిచేసారు. ఈయన స్వగ్రామం హుజురాబాద్ మండలం కనుకులగిద్ద కావడం గమనార్హం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!