28-09-2024 NORMAL NEWS 06:31 AM
swarnodayam.com
Telugu Daily News
28-09-2024 06:31 AM By Mandala Yadagiri

కోట లక్ష్మణ్ కుటుంబానికి సబ్బని ఆర్థిక సాయం అందజేత

కోట లక్ష్మణ్ కుటుంబానికి సబ్బని ఆర్థిక సాయం అందజేత
IMG_20240928_172857

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్ అనారోగ్య తో మృతి చెందగా శనివారం ఆయన కుటుంబాన్ని సామాజికవేత్త సబ్బని వెంకట్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి రూ .10,000/- ఆర్థిక సహాయం చేశారు. అలాగే వారి పిల్లల చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులో స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఫీజు రాయితీ చేయించారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగెం సత్యనారాయణ, చిలుకమారి శ్రీనివాస్, కుడికాల సాయి, ఇప్పలపల్లి శ్రీనివాస్, జనార్ధన్, వడ్డేపల్లి సాయి, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!