02-10-2024 NORMAL NEWS 03:15 AM
swarnodayam.com
Telugu Daily News
02-10-2024 03:15 AM By Mandala Yadagiri

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రణవ్.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రణవ్.
IMG_20241002_141230

మహాత్ముడి స్మరణలో ప్రణవ్..

స్వాతంత్రం కోసం మహాత్ముడు చేసిన సేవలు మరువలేనివి.

వావిలాల ఖాదీ గ్రామద్యోగ ప్రతిష్ట సంస్థ సందర్శన.

నిర్వహుకులతో కలిసి రాట్నం మీద నూలువడికిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి కృషి చేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనచిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.బ్రిటిష్ పాలకుల నుండి విముక్తికొరకు,సత్యమార్గంలో గాంధీ చేసిన సేవలు మరువలేనివనీ అన్నారు.అనంతరం జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల గ్రామములో గల వావిలాల ఖాదీ గ్రామద్యోగ్ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ సూత్ర యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనీ,కార్మికులతో కలిసి రాట్నం మీద నూలు వడికారు.ఈ సందర్భంగా నిర్వహుకులు ప్రణవ్ కు స్వాగతం పలికారు.ప్రతీ ఏటా నిర్వహించే అఖండ సూత్ర యజ్ఞ కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు.గాంధీ ద్వారా నెలకొల్పబడిన ఈ ఖాదీ బండార్ సంస్థ 1929లో ప్రారంభంమై,1983లో మెట్ పల్లి నుండి విడిపోయి సొంత సంస్థాగా ఏర్పడిందనీ,తొలిసారిగా ఏర్పడిన ఈ సంస్థకు మాజీ ప్రధాని పివి నరసింహ రావు చైర్మన్ గా కొనసాగారు.తదనంతరం వొడితల(సింగాపురం) రాజేశ్వర్ రావ్ సుదీర్ఘ కాలంగా చైర్మన్ గా కొనసాగారనీ,ఖాదీ కమిషన్ ద్వారా అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఈ సంస్థ అభివృద్ధికి రాజేశ్వర్ రావు దోహదపడ్డారనీ తెలిపారు.ప్రజల్లోకి ఖాదీ యొక్క విశిష్టతను గ్రామ గ్రామాన తెలుసుకోవడానికి అఖండ సూత్ర యజ్ఞ కార్యక్రమం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
తనుగుల…
ఆరు గ్రామాలకు సంబంధించిన తనుగుల చెరువును ప్రణవ్ సందర్శించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మత్తడి పూర్తిగా దగ్ధం అయ్యిందని గ్రామస్తులు తెలుపగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి అలసత్వం వహించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రణవ్ కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!