06-10-2024 NORMAL NEWS 02:10 AM
swarnodayam.com
Telugu Daily News
06-10-2024 02:10 AM By Mandala Yadagiri

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా.. – అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా.. – అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
IMG_20241006_130745

యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా

జమ్మికుంట లో పట్టభద్రులతో సమావేశం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట మండల కేంద్రంలోని సాహితి జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పించి, రానన్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని కోరారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లా కేంద్రంలో యువతకు తన సొంత ఖర్చుతో ఒక వృత్తి నైపుణ్య కేంద్రం తో పాటు పోటీ పరీక్షలకు సిద్దమవుతూన్న వారికి ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీకి కృషి చేస్తానని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి వారి పక్షాన పోరాడుతానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ( KGBV) లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ( MTS )అమలుచేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల డిమాండ్ ఉందని, వారి సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన పిఆర్సి అమలు, డిఏ పెంపు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన పలు విద్యాసంస్థల అధినేతలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!