09-10-2024 NORMAL NEWS 10:21 AM
swarnodayam.com
Telugu Daily News
09-10-2024 10:21 AM By Mandala Yadagiri

పేదలకు మోడీ సర్కారు దసరా కానుక.. ఉచిత రేషన్ మరో 4 ఏళ్లు పొడిగింపు..!!

పేదలకు మోడీ సర్కారు దసరా కానుక.. ఉచిత రేషన్ మరో 4 ఏళ్లు పొడిగింపు..!!
IMG_20241009_211724

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ ద్వారా ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లపాటు కొనసాగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెబుతూ దసరా కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం సరఫరా పథకాన్ని (విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్) పొడిగించడానికి ఆమోదించింది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 సమృద్ధిగా అందించడం ద్వారా భారతదేశంలో రక్తహీనత, సూక్ష్మపోషక పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే ఈ చొరవ లక్ష్యంగా పేర్కొంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY), ఇతర సంక్షేమ పథకాలతో సహా ప్రభుత్వ అన్ని పథకాల క్రింద జులై 2024 నుండి సార్వత్రిక ఉచిత బలవర్ధక బియ్యాన్ని అదించడం డిసెంబర్ 2028 వరకు కొనసాగించడానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి? రేషన్ లో ఇస్తున్నవి ఇవేనా?

సాధారణ బియ్యాన్ని పిండిలా చేసిన తర్వాత వాటికి అవసరమైన మోతాదులో విటమిన్లను, ఖనిజాలను కలుపుతారు. మళ్లీ వీటిని బియ్యంగా మారుస్తారు. ఈ గింజలనే ఫోర్టిఫైడ్‌ రైస్ (ఫోర్టీఫైడ్ కెర్నల్స్‌) అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఫోర్టిఫైడ్ రైస్ ను అందివ్వడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోంది. ఏప్రిల్ 2022లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) మార్చి 2024 నాటికి దశలవారీగా దేశవ్యాప్తంగా బియ్యం బలపరిచే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పూర్తిగా పోర్టీఫైడ్ రైస్ ను అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై), ఇతర పథకాలతో సహా ప్రభుత్వ అన్ని పథకాల క్రింద సార్వత్రిక ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొనసాగించడానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంక్షేమ పథకాలు జూలై 2024 నుండి డిసెంబర్ 2028 వరకు ఈ పథకాలు కొనసాగుతాయి. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం పీఎంజీకేఏవై, (ఆహార సబ్సిడీ) లో భాగంగా ప్రభుత్వం 100 శాతం కేంద్ర నిధులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో మరో నాలుగేళ్లు అంటే 2028 వరకు కొనసాగనుంది. దేశ పేద జనాభాలో రక్తహీనత, సూక్ష్మపోషక పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి, ఆహార బలపరిచేటటువంటి సురక్షితమైన, సమర్థవంతమైన చర్యగా ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రశంసలు ఉన్నాయి. భారతదేశంలో బియ్యం సూక్ష్మపోషకాలను సరఫరా చేయడానికి బియ్యం అనువైన వారది.. ఎందుకంటే జనాభాలో 65 శాతం మంది దీనిని ప్రధాన ఆహారంగా వినియోగిస్తున్నారు.

సాధారణ బియ్యం (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సూక్ష్మపోషకాలు (ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12)తో సమృద్ధిగా ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కె)ను రైస్ ఫోర్టిఫికేషన్‌లో చేర్చడం జరుగుతుంది. ఏప్రిల్ 2022లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) మార్చి 2024 నాటికి దశలవారీగా దేశవ్యాప్తంగా బియ్యం బలపరిచే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయనీ, మార్చి నాటికి ప్రభుత్వ పథకాలన్నింటిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు సార్వత్రిక కవరేజీ లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రివర్గం తెలిపింది. దేశంలో పోషకాహార భద్రత ఆవశ్యకతపై 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్తహీనతను పరిష్కరించడానికి “టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్ (ICDS), PM POSHAN (పూర్వపు MDM) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా” వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం, రక్తహీనత భారతదేశంలో విస్తృతమైన సమస్యగా మిగిలిపోయింది. వివిధ వయస్సుల సమూహాలు, ఆదాయ స్థాయిలలో పిల్లలు, మహిళలు, పురుషులను ప్రభావితం చేస్తుంది. ఈ పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)తో సహా ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేస్తుంది. జూలై 2024 నుండి డిసెంబర్ 2028 వరకు అమలులో ఉంటుంది. రక్తహీనత, పోషకాహార లోపాలను తగ్గించే లక్ష్యంతో బలవర్థకమైన బియ్యం పంపిణీకి చొరవగా PMGKAY కింద కేంద్ర ప్రభుత్వం 100% నిధులు సమకూరుస్తుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ పథకం దేశవ్యాప్తంగా బియ్యం బలవర్ధకానికి ఏకీకృత వ్యవస్థను నిర్ధారిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 80 కోట్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!