03-12-2024 NORMAL NEWS 08:33 PM
swarnodayam.com
Telugu Daily News
03-12-2024 08:33 PM By Mandala Yadagiri

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి.-హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి. – త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని మంత్రి హామీ.

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి.-హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి. – త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని మంత్రి హామీ.
Oplus_131072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ప్రభుత్వ పెద్దల వద్ద తన గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తన వంతుగా కృషి చేస్తూనే…ప్రభుత్వాల పరంగా చేయాల్సిన విషయాలపై సామాజికవేత్త తన వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ.. పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల జమ్మికుంట సివిల్ హాస్పిటల్ ను సందర్శించి వసతుల కల్పన, వైద్య నిపుణుల కొరత గురించి వాకబు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో గుండె వైద్య నిపుణుల కొరత, ఆవశ్యకత గురించి తెలుసుకుని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాని కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. తనతో ఉన్న సన్నిహిత్యం కారణంగా మంత్రి కూడా సానుకూలంగా స్పందించి.. త్వరలో అధికారులతో మాట్లాడి గుండె వైద్య నిపుణులను నియమిస్తానని హామీ ఇచ్చారని సబ్బని వెంకట్ తెలిపారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!