Telugu Daily News
జమ్మికుంట పట్టణంలో బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి బోల్త ..తలకు తీవ్ర గాయాలు.

స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో బ్రిడ్జి వద్ద గట్టు సతీష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి జమ్మికుంట పట్టణం కొత్తపల్లికి చెందిన గట్టు సతీష్ వయస్సు (37) సంవత్సరాలు. పరిస్థితి విషమంగా ఉండడముతో 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించగా మళ్ళీ మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ హాస్పిటల్ కు తరలించారు.


