Telugu Daily News
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ నిర్ణయం మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 10న నిర్వహించే నిరవధిక సమ్మె కార్యక్రమం కు సంబంధించి ఈరోజు హుజురాబాద్ మండల విద్యాశాఖ అధికారి బి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు గుండా రాజిరెడ్డి, తాళ్లపెళ్లి అమరేందర్ గౌడ్, శనిగరపు సుధామన్, పడమటింటి మధు తదితరులు పాల్గొన్నారు.


