Telugu Daily News
ప్రమాదవశాత్తు కిందపడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం ఆర్టీసీ బస్సుడిపో క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపై గుంతను గమనించక ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడటంతో ఇప్పల నర్సింగాపూర్ కు చెందిన పరకాల శ్రీనివాస్, ధర్మరాజుపల్లి కి చెందిన చింటూ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓకే బండి మీదా వస్తుండగా డిపో క్రాస్ వద్ద గుంతను గమనించక టైరు పడడంతో ఎగిరిపోయి కిందపడ్డారు. శ్రీనివాస్ కు కాళ్ళు విరగగా, చింటుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు.



