07-01-2025 NORMAL NEWS 08:08 PM
swarnodayam.com
Telugu Daily News
07-01-2025 08:08 PM By Mandala Yadagiri

ప్రమాదాల నివారణ కోసమే రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు..హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి

ప్రమాదాల నివారణ కోసమే రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు..హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి
IMG-20250107-WA0124

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హుజురాబాద్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రంబుల్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నామని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హుజురాబాద్ లోని సైదాపూర్ మూల మలుపు వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటులో భాగంగా ఆయన మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని ఆయన అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నడపాలని, ముఖ్యంగా మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదల సంఖ్య చాలావరకు తగ్గించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్టు వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వెహికిల్స్ సీజ్ చేయడంతోపాటు వారి లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ సీఐ తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై యునెస్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!