08-01-2025 NORMAL NEWS 12:48 PM
swarnodayam.com
Telugu Daily News
08-01-2025 12:48 PM By Mandala Yadagiri

హుజురాబాద్ నియోజకవర్గంలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజకవర్గంలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20250108-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ఉప్పల్, శనిగరం, వావిలాల, చల్లూరులను వెంటనే నాలుగు మండలాలుగా ప్రకటించాలని ఆయన హైదరాబాదులోని తన స్వగృహంలో మాట్లాడారు. ఈ నాలుగు గ్రామాలకు మండలాలుగా ప్రకటించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, దీంతో నియోజకవర్గం లోని ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మండలాల ఏర్పాటుతో నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ నాలుగు గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!