20-01-2025 NORMAL NEWS 12:05 PM
swarnodayam.com
Telugu Daily News
20-01-2025 12:05 PM By Mandala Yadagiri

హుజురాబాద్ డివిజన్ పాపారావు బొంద ఆటో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

హుజురాబాద్ డివిజన్ పాపారావు బొంద ఆటో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక
IMG_20250120_120150

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పాపారావు బొంద ఆటో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఇసంపల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా కొంగ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారి బాణాల రాజు, ప్రచార కార్యదర్శి రొంటాల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా చల్లూరి వేణు, లోకిని తిరుపతి, ఎండి రఫీ, గుండాల మధు, ఎండి అంకుస్, ఎండి పాషా, దాట్ల రవి, కే స్వామి, లింగారెడ్డిలను నూతన కమిటీగా పాపారావు బొంద ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులందరూ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072 పాపారావు బొంద ఆటో యూనియన్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాజేందర్, ప్రవీణ్ లు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!