Telugu Daily News
దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి ఆమె!

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి IPS అయ్యింది. 22 ఏళ్లకి రెండోసారి ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్ అధికారిణి అయ్యింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది.


