02-03-2025 NORMAL NEWS 10:27 AM
swarnodayam.com
Telugu Daily News
02-03-2025 10:27 AM By Mandala Yadagiri

మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీపీ ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీపీ ఆర్థిక సహాయం
IMG-20250302-WA0016

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం(తోకలపల్లి)లోని మ్యాకల గంగమ్మ, కదిరే రాజయ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ మాజీ ఎంపిపి ఇరుమల్ల రాణిసురేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 చొప్పున ఇరువురి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. వారు మృతి చెందిన తీరని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డితో పాటు, మాజీ ఎంపీటీసీ పంజాల సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధ వాసుదేవరెడ్డి, కుమారస్వామి, చిరంజీవి, సమ్మయ్య, కొమురయ్య, రాకేష్, సంజీవ్, రాజయ్య, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న తాజా మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!