Telugu Daily News
రేపు ఉదయం 10 నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలో తేదీ 08-03-2025 శనివారం రోజున 33 kv హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతులు ఉదయమ్ 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు చేయనుండగా విద్యుత్తు సరఫరా నిలిపి వేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ పట్టణం మొత్తం మరియు బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడ జరుగుతుందని, స్థానిక ప్రజలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నందున వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.


