Telugu Daily News
పోలీస్ కమిషనర్ ను కలసిన టీడబ్ల్యూజెఎఫ్ నాయకులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని సీపీని కోరారు. పోలీస్ కమిషనర్ ను కలసిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి జి.కిరణ్, నాయకులు ఎల్ సురేష్ లు ఉన్నారు.


