28-03-2025 NORMAL NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News
28-03-2025 09:41 PM By Mandala Yadagiri

ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. – మున్సిపల్ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి

ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. – మున్సిపల్ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి
IMG_20250328_213917

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ చౌరస్తా నుండి తొలగించిన ఇందిరా గాంధీ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరామాలకు రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం ఉండేదని దానిని అప్పటి మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ తొలగించారని తెలిపారు. మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, సీనియర్ నాయకులు సొల్లు దశరథం, మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!