Telugu Daily News
తుమ్మనపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోనీ ప్రజలు చాలా నిష్టతో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలను అమ్మవారికి సమర్పించారు. మహిళలు ఇంటి వద్ద బోనాలను పూజించి నెత్తిన పెట్టుకొని మేళతారాలతో గ్రామ శివారులోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. పండుగ వాతావరణంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివెళ్ అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు.




