15-04-2025 NORMAL NEWS 10:47 AM
swarnodayam.com
Telugu Daily News
15-04-2025 10:47 AM By Mandala Yadagiri

డిటిఎఫ్ సైదాపూర్ మండల శాఖ అధ్యక్షునిగా సదాశివ్, ప్రధాన కార్యదర్శిగా తిరుపతిరెడ్డి నియామకం.

డిటిఎఫ్ సైదాపూర్ మండల శాఖ అధ్యక్షునిగా సదాశివ్, ప్రధాన కార్యదర్శిగా తిరుపతిరెడ్డి నియామకం.
IMG_20250415_104128

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సైదాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా
సైదాపూర్ మండల శాఖ ఎన్నిక కోసం ఎన్నికల పరిశీలకులుగా బొంగానీ రమేశ్ రాష్ట్ర కౌన్సిలర్, వోడ్నాల రాంకిరణ్ రాష్ట్ర కౌన్సిలర్ లు వ్యవహరించారు. అలాగే వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఏరియర్స్ ఇస్తూ, PRC అమలు చేయాలని, ట్రెజరీలలో పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని కోరారు. అనంతరం సైదాపూర్ మండల శాఖకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడుగా M. సదాశివ్ LFL HM PS అమ్మనగుర్తి, ఉపాధ్యక్షులుగా T సత్యనారాయణ SA (Gug) ZPHS ఎక్లాస్పూర్, P ప్రతిమ SA (PD) ZPITS వెంకెపల్లి, ప్రధాన కార్యదర్శిగా B తిరుపతిరెడ్డి SA(Math ZPHS దుద్దెనపల్లి, కార్యదర్శులుగా K. గిరిధర్ SABID) ZPHS వెంకెపల్లి, K వెంకటరమణ SGT PS గొల్లగూడెం, ఆడిట్ కమిటీ కన్వీనర్ CH భాగ్యలక్ష్మి SA (Bio) దరిHS దుద్దెనపల్లి, జిల్లా కౌన్సిలర్స్ సభ్యులు B అజయ్ కుమార్ SA and ZPHS దుద్దెనపల్లి, బాంగాని రమేశ్ SUT PS రాయికల్, వాడ్నీల రాంకిరణ్ SA (Phy.SC) ZPHS వెంకెపల్లి, బుర్రు శ్రీనివాస్ SGT PS ఎక్లాస్పూర్ లు ఎన్నికైనట్లు రామ్ కిరణ్, రమేష్ లు ప్రకటించారు. కాగా సదాశివ్, తిరుపతి రెడ్డి ఎన్నిక పట్ల పలు ఉపాధ్యాయులు, డిటిఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

    Oplus_131072

    డిటిఎఫ్ మండల అధ్యక్షుడు మండల సదాశివ్..

    Oplus_131072

    డిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బీ తిరుపతిరెడ్డి

    Reporter

    • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

    error: Content is protected !!