19-04-2025 NORMAL NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News
19-04-2025 09:41 PM By Mandala Yadagiri

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీనాక్షి నటరాజన్ కు వినతి

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మీనాక్షి నటరాజన్ కు వినతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎస్సీ ఏ గ్రూపులోని 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలనీ హైదరాబాదులో టీజీపీసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు శనివారం బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…స్వాతంత్ర్యం వచ్చి 76సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని, బేడ బుడగ జంగాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ లో చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బుడగ జంగాలకు 15 శాతం అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవుడు కుమార్, కప్పెర జంగయ్య, పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

టీజీపీసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతి పత్రం అందజేస్తున్న బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!