22-04-2025 NORMAL NEWS 07:11 PM
swarnodayam.com
Telugu Daily News
22-04-2025 07:11 PM By Mandala Yadagiri

ఇంటర్ ఫలితాలలో కాకతీయ కళాశాల ప్రభంజనం.. రాష్ట్రస్థాయి ర్యాంకులతో కార్పొరేట్ కు ధీటుగా మరోసారి సత్తా చాటిన కాకతీయ.

ఇంటర్ ఫలితాలలో కాకతీయ కళాశాల ప్రభంజనం.. రాష్ట్రస్థాయి ర్యాంకులతో కార్పొరేట్ కు ధీటుగా మరోసారి సత్తా చాటిన కాకతీయ.
IMG-20250422-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నేడు ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. BiPC ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు గాను 438 మార్కులతో ఎస్ నాగవిశిష్ట రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఏ వైష్ణవి 437, ఆర్ శేష 436, రుబియాఫాతిమా 434, హజ్రాసదాస్ 433, ఏం నిత్యశ్రీ 432 మార్కులు సాధించారు. MPC విభాగంలో 470 మార్కులకు సహస్ర 467, వీ సంజన 467, కే నీతు 466, పి హారిక 465, 463, ఎన్ చరితార్థి 463, ఏ తనుశ్రీ 462, పీ యశశ్రీ 461 మార్యులు. CEC దిభాగంలో (ప్రథను సంవత్సరంలో 500 మార్కులకు గాను ఎన్ గోమతి 493 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా విద్యాబోధన అందుతుందని మరోసారి రుజువు చేశారు కాకతీయ విద్యార్థులు.

ద్వితీయ సంవత్సరంలో mpc విభాగంలో 1000 మార్కులకు గాను 989 మార్కులతో నాగలక్ష్మి ప్రసన్న డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. B. ప్రణిత 985, వీ సన 983, ఏం శ్రీవర్ధన్ 982 మార్కులు సాధించారు. Bipc విభాగంలో1000 బి వైష్ణవి 988, జే హర్షిణి 984 మార్కులలో డివిజన్ స్థాయిలో మార్కులు సాధించారు. వీరిని కళాశాల పిన్సిపాల్ ఏం వేణుమాధవ్, డైరెక్టర్లు సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి, కే తిరుపతిరెడ్డి, కే పవీణ్ రెడ్డి, జే ప్రకాశ్ రెడ్డితో పాటు అధ్యాపక బృందం అభినందించారు.

Oplus_131072

రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఇంటర్ విద్యార్థులను పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!