25-04-2025 NORMAL NEWS 09:40 PM
swarnodayam.com
Telugu Daily News
25-04-2025 09:40 PM By Mandala Yadagiri

ఉగ్రదాడి పిరికి పందల చర్య.. – బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్

ఉగ్రదాడి పిరికి పందల చర్య.. – బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి పిరికిపంద చర్య అని బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉగ్రదాడులను అరికట్టి దేశంలో శాంతి చేకూరేలా చూడాలని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ అన్నారు. ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు కాశెట్టి కుమార్ సంతాపం తెలిపారు.

ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులను సృష్టించేందుకు ఉగ్రవాదులు దాడులు చేశారని, ఇది అత్యంత బాధాకరమైందని, అభం శుభం తెలియని అమాయక ప్రజలు ఉగ్రదాడులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించకోక తప్పదని అన్నారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకొని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!