09-05-2025 NORMAL NEWS 07:34 PM
swarnodayam.com
Telugu Daily News
09-05-2025 07:34 PM By Mandala Yadagiri

భారత ఆర్మీకి సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులు ర్యాలీ

భారత ఆర్మీకి సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులు ర్యాలీ
IMG_20250509_193144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భారత ఆర్మీకి సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు మాట్లాడుతూ పాకిస్థాన్ ఇక నైనా ఉగ్రవాద చర్యలను విరమించుకోవాలని లేని పక్షంలో భారత ఆర్మీ తగిన రీతిలో జవాబు చెప్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యతిపతి అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ల రమేష్, బార్ ఆసోసియేషన్ ముఖ్య సలహాదారులు అందే వెంకటేశ్వరరావు, లైబ్రెరీ సెక్రటరీ భాను కిరణ్, ట్రెజరర్ బాగోతం కుమారస్వామిలతో పాటు, న్యాయవాదులు నల్ల భూమి రెడ్డి, కంకణాల అమరేందర్ రెడ్డి, యేంగల లింగమూర్తి, కలకోటి శ్రవణ్, తల్లపెళ్లి కుమార్, జక్కుల శ్రీనివాస్, మోరే కళ్యాణ్, చిదురాల శ్రీనివాస్, బొంగొని హరికృష్ణ, గుర్రాల వెంకటకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
అంబేద్కర్ చౌరస్తాలో భారత ఆర్మీకి సంఘీభావం తెలుపుతున్న న్యాయవాదులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!