20-05-2025 NORMAL NEWS 03:13 PM
swarnodayam.com
Telugu Daily News
20-05-2025 03:13 PM By Mandala Yadagiri

కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..నోటీసులు పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..నోటీసులు పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
IMG-20250520-WA0080

జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశం

కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల.

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై 14 నెలలుగా కొనసాగుతున్న ఘోష్ కమిషన్‌ విచారణ తర్వాత సుమారు 200 మంది అధికారులను విచారించిన కమిషన్‌.. 25 మంది మాజీ ఐఏఎస్‌లతో పాటు ప్రస్తుత ఐఏఎస్‌లను విచారించిన కమిషన్‌. అధికారులు, ఇంజినీర్ల విచారణ సందర్భంగా పలుమార్లు కేసీఆర్‌, హరీష్‌రావు, ఈటల పేర్లు ప్రస్తావన వచ్చింది విధితమే. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయన్న కమిషన్‌, డీపీఆర్‌లు ఒకలా.. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని నిర్ధారణకు వచ్చి బ్యారేజీల్లో నీరు నిల్వ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారన్న ఈఎస్సీలు, ఇంజినీర్లు.. దీంతో విచారణకు హాజరు కావాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5వ తేదీ లోగా విచారణ కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!