26-06-2025 NORMAL NEWS 09:23 PM
swarnodayam.com
Telugu Daily News
26-06-2025 09:23 PM By Mandala Yadagiri

యువత మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన వ్యాసరచన పోటీలు. – జిల్లాస్థాయి పోటీల్లో హుజురాబాద్ కి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు.. అభినందించిన టౌన్ సీఐ కరుణాకర్

యువత మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన వ్యాసరచన పోటీలు. – జిల్లాస్థాయి పోటీల్లో హుజురాబాద్ కి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు.. అభినందించిన టౌన్ సీఐ కరుణాకర్
IMG-20250626-WA0121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
యువతలో మత్తుపదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆదేశాల మేరకు హుజూరాబాద్ పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హుజురాబాద్ గర్ల్స్ హైస్కూల్, చెల్పూర్ హైస్కూల్‌లలో విద్యార్థుల మధ్య డ్రగ్స్ తో అనర్థాలు, అనారోగ్యాలపై వ్యాస రచన పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీల్లో హుజురాబాద్ జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్‌కి చెందిన ఎల్ లక్ష్మీ ప్రసన్న ప్రథమ బహుమతిని గెలుచుకోగా, చెల్పూర్ హైస్కూల్‌కు చెందిన రాంపూర్ గ్రామానికి చెందిన గట్టు హరిణి ద్వితీయ బహుమతిని, అదే స్కూల్‌కు చెందిన ఏదులాపురం శృతి తృతీయ బహుమతిని సాధించింది. గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ కే కరుణాకర్ విజేతలను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఏకాగ్రత, కృషి, పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదగాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సీఐ సూచించారు.

Oplus_16908288
ప్రథమ బహుమతి సాధించిన లడే ప్రసన్నలక్ష్మికి బహుమతి సర్టిఫికెట్ అందజేస్తున్న సిపి గౌస్ ఆలం
Oplus_16908288

ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థినిలను అభినందిస్తున్న హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!