10-07-2025 NORMAL NEWS 10:02 PM
swarnodayam.com
Telugu Daily News
10-07-2025 10:02 PM By Mandala Yadagiri

తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి

తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి
IMG-20250710-WA0127

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ..”18 కేబినెట్‌ సమావేశాల్లో 327 అంశాలు చర్చించాం. 321 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు ఆమోదం. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయి. రెండువారాలకోసారి కేబినెట్‌ సమావేశం. జులై 25న మళ్లీ కేబినెట్‌ సమావేశం.” అని అన్నారు. అలాగే బీసీల 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం జరుగుతుందని, దీనికోసం క్యాబినెట్ ఆమోదం పొందినట్లు మంత్రి వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!