14-07-2025 NORMAL NEWS 08:19 PM
swarnodayam.com
Telugu Daily News
14-07-2025 08:19 PM By Mandala Yadagiri

మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన వారిపై కఠిన చర్యలు.. – హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్

మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన వారిపై కఠిన చర్యలు.. – హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్
IMG-20250714-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మత్తు పదార్థాలు అమ్మిన వారిపై, సేవించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్నారని, అమ్ముతున్నారని అనుమానంతో రద్దీ ఉండే ప్రదేశాలలో కరీంనగర్ స్పెషల్ టీంతో అనుమానిత ప్రదేశాలను, బస్టాండ్, కొన్ని సూపర్ మార్కెట్లను అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మానుష ప్రాంతాలలో ఎవరైనా మత్తు పదార్థాలు గంజాయి లాంటి వాటిని సేవిస్తే వారి సమాచారాన్ని పోలీస్ వారికి ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ తనిఖీలలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రాధాకిషన్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_16908288

బస్టాండ్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..

Oplus_16908288

షాపింగ్ మాల్ లో డాగ్స్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు..

Oplus_16908288
Oplus_16908288

కళాశాల, పాఠశాల ఆవరణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు…

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రాధాకిషన్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!