17-07-2025 NORMAL NEWS 12:02 AM
swarnodayam.com
Telugu Daily News
17-07-2025 12:02 AM By Mandala Yadagiri

చదువుతోపాటు సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలి. – మాంటిసోస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతా రాజు

చదువుతోపాటు సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలి. – మాంటిసోస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతా రాజు
1003496006

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక తదితర రంగాల్లో రాణించాలని మాంటిసోస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతా రాజు అన్నారు.బుధవారం పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న కె. రియాన్షిత ఇటీవల నృత్య ప్రదర్శనలో రాణించి శ్రీ నాట్యరవలి 2025 పురస్కారాన్ని అందుకోవడాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బట్టి చదువులతో గడపకుండా తమలోని సృజనాత్మకతను బయటికి తీసి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజూ థామస్ ఫ్లోర్ ఇన్చార్జులు సంధ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శనలో రాణించి శ్రీ నాట్యరవలి 2025 పురస్కారాన్ని అందుకున్న రియాన్షిత ను అభినందిస్తున్న మాంటిసోరి పాఠశాల ప్రిన్సిపల్, డైరెక్టర్

——————–++++++++——————–

&పత్రికా ప్రకటనలు&

——————-++++++++——————

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!