కరీంనగర్ లో బీజేపీ ఈసి ఓట్ చోరీ పై నిరసన ప్రదర్శన..క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ప్రణవ్..

– బీజేపీ ద్వంద్వ వైఖరినీ ప్రజల్లోకి తీసుకెళ్తాం..
– హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: బీజేపీ పార్టీ దేశంలో అరాచకాలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ చేసిన ఓట్లు దొంగతనాన్నీ కళ్ళకు కట్టినట్లు రుజువు చేశారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద కరీంనగర్ డిసీసి అధ్యక్షుడు, మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వంలో కొవ్వతుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఓట్ల దొంగతనాన్నీ ఎలా చేస్తుందో ప్రజలకు వివరిస్థామని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పే కాలం దగ్గరపడ్డదని అన్నారు.


ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్….


