21-08-2025 NORMAL NEWS 07:51 PM
swarnodayam.com
Telugu Daily News
21-08-2025 07:51 PM By Mandala Yadagiri

కవ్వంపల్లికి పొలాడి పరామర్శ.

కవ్వంపల్లికి పొలాడి పరామర్శ.
IMG-20250821-WA0178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు గురువారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎంఎల్ఏ సోదరుడు రాజేశం అనారోగ్యంతో బుధవారం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని చిత్ర పటానికి పూలమాలలు వేసి పోలాడి నివాళులర్పించారు. రాజేశం మృతి చెందిన తీరును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శిస్తున్న ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!