24-08-2025 NORMAL NEWS 09:52 PM
swarnodayam.com
Telugu Daily News
24-08-2025 09:52 PM By Mandala Yadagiri

ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్

ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్
IMG-20250824-WA0110

వినాయక చవితికి ప్రభుత్వం కానుక..!

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా మాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. పీవోపీ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణానికి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నిమజ్జన చివరి రోజున రద్దీని తగ్గించేందుకు మూడు లేదా 5, 7రోజున నిమజ్జనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఫిట్ నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నిమజ్జనానికి ఉపయోగించాలన్నారు. ముందస్తు అనుమతులతో మాత్రమే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, డీజేలకు అనుమతి లేదన్నారు.

మతపరమైన ప్రదేశాల వద్ద జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉంచకూడదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ లు నిషేధమని స్పష్టం చేశారు. విరాళాలు స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలన్నారు. అలాగే మండలాల వద్ద మద్యం సేవించడం, జూదం వంటి ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 10వ రోజు నిమజ్జనంతో పాటు మిలాద్-ఉన్ -నబీ ఉండడంతో శాంతిభద్రతలపై పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

గణేష్, దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ కి సంబంధించి జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!