10-10-2025 NORMAL NEWS 04:22 PM
swarnodayam.com
Telugu Daily News
10-10-2025 04:22 PM By Mandala Yadagiri

దీపావళి టపాసులు యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

దీపావళి టపాసులు యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
IMG_20251010_161834

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దీపావళి సందర్భంగా హుజురాబాద్ లోని దీపావళి టపాసుల యూనియన్ నూతన కార్యవర్గం శుక్రవారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జమాల్ పూర్ అనిల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడుగా ఐతే కిషోర్, ప్రధాన కార్యదర్శిగా బుర్ర కుమార్ గౌడ్, గౌరవ అధ్యక్షుడుగా చొక్కారపు యాదగిరిలతో పాటు కోశాధికారిగా మాడిశెట్టి బాలకృష్ణన్లు ఎన్నికయ్యారు. అలాగే గౌరవ సభ్యులుగా భూపతి లచ్చన్న, కొమురవేల్లి కిరణ్, గౌతమ్, ముఖ్య సలహాదారులుగా మొలుగు భానుచందర్, గోస్కుల రాజ్ కుమార్ లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల సభ్యులందరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ తనపై నమ్మకం నుంచి అధ్యక్షుడుగా ఎన్నుకున్న సభ్యులందరికీ తన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలి వేణు, బన్నీ మైస, జల్సా, భరత్, బండి సాయి కృష్ణ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షుడు జమాల్ పూర్ అనిల్
నూతనంగా ఎన్నికైన దీపావళి టపాసులు యూనియన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!