27-10-2025 NORMAL NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News
27-10-2025 11:13 PM By Mandala Yadagiri

మహిళా అదృశ్యం.. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు

మహిళా అదృశ్యం.. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు
IMG-20251027-WA0091

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు దేశ్పాల్ శోభ. ఈమె వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది . ఈమె గత నాలుగు రోజుల క్రితం తన చిన్న కూతురు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయినందున ఆమెను చూసుకోవడానికి తన సొంత గ్రామమైన ఉప్పరపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా నుండి రావడం జరిగిందన్నారు. ఈరోజు సోమవారం ఉదయం అందాజ ఆరున్నర గంటల ప్రాంతంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈమె గురించి వారి కుటుంబ సభ్యులు హుజురాబాద్ పట్టణ ప్రాంతంలో వెతికినా కూడా ఆచూకీ లభించలేదు. కనుక ఈ విషయమై తప్పిపోయిన మహిళ యొక్క పెద్ద కూతురైన గీత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇట్టి మహిళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే హుజురాబాద్ పోలీస్ కి సమాచారం ఇవ్వగలరన్నారు.
CI Huzurabad -8712670773

SI హుజురాబాద్ -8712574726

పై నెంబర్లలో సంప్రదించి సమాచారం ఇవ్వాలన్నారు.

తప్పిపోయిన మహిళ దేశ్పాల్ శోభ.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!