Social 1080×1350 • Multi-page
31-12-2025 BREAKING NEWS 05:15 PM
swarnodayam.com
Telugu Daily News

చదువుతోపాటు విద్యార్థులు క్రీడలో రాణించాలి.

చదువుతోపాటు విద్యార్థులు క్రీడలో రాణించాలి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని మాంటిస్సోరి ప్రిన్సిపాల్ గీతాషాజు అన్నారు. బుధవారం పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన మహమ్మద్ నూరిన్ జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గతనెల డిసెంబర్ 25న వనపర్తిలో జరిగిన అండర్ 14 హాకీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభను కనపరిచినందుకు జనవరి 2వ తేదీన మధ్యప్రదేశ్ లో ని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి అండర్ 14 బాలికల హాకీ పోటీల్లో ఆమె ఎంపిక కావడం ప్రశంసనీయమన్నారు. ఈ విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకొని మరెందరో క్రీడాకారులు తయారు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ షాజూ థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మహమ్మద్ నూరిన్ ను శాలువా కప్పి సన్మానిస్తున్న పాఠశాల యాజమాన్యం.. అలాగే

జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన నూరిన్ ను తాజ మాజీ కౌన్సిలర్ పెళ్ళ వెంకట్ రెడ్డి శాలువా కప్పి సన్మానిచే అభినందనలు తెలిపారు.

జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన నూరిన్ ను సన్మానిస్తున్న తాజ మాజీ కౌన్సిలర్ పెళ్ళ వెంకట్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!