Telugu Daily News
హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ముసబ్ అహ్మద్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ నూతన కమిషనర్ గా సయ్యద్ ముసబ్ అహ్మద్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం కమిషనర్ గా పనిచేసిన కే సమ్మయ్య హైదరాబాదుకు బదిలీ కాగా నల్గొండలో పనిచేసే గ్రేడ్ – I కమిషనర్ హుజురాబాద్ కు బదిలీ అయ్యారు. కాగా శుక్రవారం ఆయన పాత కమిషనర్ సమయం నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్ కు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికారు.

పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్


