05-02-2026 NORMAL NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News
05-02-2026 11:20 PM By Mandala Yadagiri

బీజేపీ పార్టీకి బిగ్ షాక్.. -కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్..

బీజేపీ పార్టీకి బిగ్ షాక్.. -కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్..
IMG-20260205-WA0159

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు భాషవేణి భాస్కర్ యాదవ్, అతని అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ ఇంచార్జి ప్రణవ్. అనంతరం నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే అని, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగిన ప్రజలు మార్పుకు శ్రీకారం చుడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

భాస్కర్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రణవ్

బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరులతో కలిసి చేరిన భాస్కర్ యాదవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!