14-05-2026 NORMAL NEWS 09:45 PM
swarnodayam.com
Telugu Daily News
14-05-2026 09:45 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో వెలసిన బండి భగీరథ పోస్టర్లు.. – తొలగించిన బిజెపి కార్యకర్తలు.

హుజురాబాద్ లో వెలసిన బండి భగీరథ పోస్టర్లు.. – తొలగించిన బిజెపి కార్యకర్తలు.
IMG_20260514_214023

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కనిపించుట లేదన్న పోస్టర్లు హుజురాబాద్ పట్టణంలో గురువారం వెలిసాయి. బండి భగీరథ పై పోక్సో కేసు నమోదైన సందర్భంగా ఆయన కనిపించుట లేదన్న పోస్టర్లు హైదరాబాదు తో పాటు ఇతర ప్రాంతాల్లో కనిపించగా తాజాగా హుజురాబాద్ లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం కనిపించాయి. భగీరథ కనిపించుట లేదన్న పోస్టర్లు హుజురాబాద్ లో వెలిశాయన్న సమాచారం తెలుసుకున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు వాటిని తొలగించారు. ఏది ఏమైనా అప్పటికి రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున చాలా వీధులలో పోస్టర్లు వేయడం పట్టణంలో చర్చనీయాంశగా మారింది.

హుజురాబాద్ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ వెలిసిన బండి భగీరథ పై రూపొందించిన వాల్పపోస్టర్

వెలసిన పోస్టర్లను తొలగిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!