15-07-2026 NORMAL NEWS 08:56 PM
swarnodayam.com
Telugu Daily News
15-07-2026 08:56 PM By Mandala Yadagiri

స్త్రీల రక్షణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది..!? – సమాజంలో స్త్రీలకు రక్షణ కల్పించండి.. – హుజురాబాద్ లో విద్యార్థినిల మానవహారం

స్త్రీల రక్షణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది..!? – సమాజంలో స్త్రీలకు రక్షణ కల్పించండి.. – హుజురాబాద్ లో విద్యార్థినిల మానవహారం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జనాభాలో సగానికి పైగా ఉన్న స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, చిత్తశుద్ధి లేకపోవడంతో సమాజంలో స్త్రీలకు రక్షణ కరువైందని స్వేరో నాయకురాలు అకినపల్లి శిరీష, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస, బిసి సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ లు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలో స్వేరో ఆధ్వర్యంలో బాలికలు పోక్సో నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.

మానవహారంగా మారిన విద్యార్థులు..

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ…నేటి సమాజంలో 9 నెలల పసికందు మొదలుకొని పండు ముసలివరకు ఆడపిల్లలు, మహిళలపై నిరంతరం జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చేసిన వారిని నడిరోడ్డు పైన ఉరితీయాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైన మహిళలపై మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. పోక్సో నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో రాష్ట్రంలో రాజ్ కుమార్ లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి అన్నారు. ఫోక్సో కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర సహాయ మంత్రి కుమారుడికే బెయిల్ దొరకగా లేనిది మనకు దొరకదా అనే రీతిలో మానవ మృగాలు తయారయ్యాయని అన్నారు. పోక్సో నిందితులను బహిరంగంగా ఉరితీస్తే సమాజంలో మానవ మృగాలకు భయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో అనేక కేసులు జరుగుతుండడం వారికి బెయిల్ వస్తుండడంతో మహిళ లోకం ఆందోళనలో ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మహిళలపై అఘాయిత్యాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస, బిసి సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, బీసీ జేఏసీ అధ్యక్షుడు సందెల వెంకన్న, కౌన్సిలర్ గందె శ్రీనివాస్ రాధిక, మాజీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కేడి సిసి బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్
ప్రజాసంఘాల నాయకులు బిసి జేఏసీ సెక్రెటరీ చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, స్వేరో నాయకులు గడప రాజు, మేకల రవీందర్, దేవసాని ప్రియదర్శిని, ప్రవీణ్, క్రాంతి, సొల్లు బాబు, శోభ, ఎండి బాబర్, ఎండి ఫరీదా, వాగ్దేవి, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!