Social 1080×1350 • Multi-page
29-07-2026 BREAKING NEWS 11:49 PM
swarnodayam.com
Telugu Daily News

హస్తినలో తెలుగు వెలుగు’ వేడుకల్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుకు జాతీయ విశిష్ట సేవా పురస్కారం

హస్తినలో తెలుగు వెలుగు’ వేడుకల్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుకు జాతీయ విశిష్ట సేవా పురస్కారం
IMG-20260729-WA0048

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ, జూలై 29: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుకు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ప్రతిష్ఠాత్మక ‘జాతీయ విశిష్ట సేవా పురస్కారం’ ప్రదానం చేసింది. న్యూఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ భవన్లో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించిన ‘హస్తినలో తెలుగు వెలుగు’ వేడుకల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

ప్రజా జీవితం, వెనుకబడిన వర్గాల సంక్షేమం, తెలుగు భాషా–సాహిత్యాభివృద్ధి, సామాజిక రంగాల్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామప్రసాద్, పరిషత్ ప్రతినిధులు ముత్యాల శ్రీనివాస్, డాక్టర్ సుధీర్ రమణ, కాంతేటి వెంకటరాజు, ఆదిలీలా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్. ఆదినారాయణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు, కళాకారులు, సామాజికవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!