Telugu Daily News
ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్ కు ఘనంగా వీడ్కోలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా పనిచేసే బదిలీ అయిన వి రవీంద్రనాథ్ మంగళవారం ఆర్టిసి ఉద్యోగులు కార్మికులు ఘనంగా వేడుకలు పలికారు. డిపో ఆవరణలో బదిలీపై వెళుతున్న డిఎం రవీంద్రనాథ్ కు వీడ్కోలు , హుజురాబాద్ డిఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన దయాకర్కు ఆహ్వానం పలికే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న రవీందర్ నాధుడు ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా సన్మానించగా, నూతన డిఎం దయాకర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఏంఎఫ్. సమ్మయ్య, సి.ఐ. ఏంజెల్, సూపరిండెంట్ నసీరుద్దీన్, సెక్యూరిటీ హెడ్ గార్డ్ రవీందర్ రెడ్డి, చక్రపాణి, తిరుమలేశ్ , టిఎస్.సింగ్, కిషోర్, టి.శ్రీనివాస్, అశోక్ బాబు, పి.ఎస్. రెడ్డి,టి.ఎస్.రెడ్డి, సుమలత, శ్రీలత, జ్యోస్న , స్రవంతి, జ్యోతి, రాములు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


