Telugu Daily News
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సిపి, చైర్ పర్సన్ సుహాసిని

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో త్వరలో జరగబోయే వినాయక నిమజ్జన ప్రాంతాన్ని కరీంనగర్ సిపి గౌస్ అలo సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు ఆటంకాలు కలవకుండా చూసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి మున్సిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, టౌన్ సిఐ బి కరుణాకర్, రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ , మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, ఏఈ నరేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్, జవాన్ ప్రతాప రాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

