హమారా ప్రసాద్ ను అరెస్టు చేయాలని ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అంబేద్కర్ ను అవమానపరిచిన హమారా ప్రసాదును అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో న్యాయవాదులు ప్రజాస్వామ్యవాదులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానిస్తూ ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించాలని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొత్తూరు రమేష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సైదాపూర్ మాజీ జెడ్పిటిసి బి రవీందర్, వేల్పుల రత్నం, భీమోజు సదానంధం, ఎడ్ల విజయకుమార్, వేల్పుల ప్రభాకర్, తునికి సమ్మయ్య, కొలిపాక సమ్మయ్య, మార్త రవీందర్, టీఎస్ సింగ్, పిఎల్ రావు, మట్టెడ ప్రకాష్, సొల్లు బాబు, రామ్ రాజేశ్వర్, దానంపల్లి ఐలయ్య, బత్తుల తిరుపతి, పశుల స్వామి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

