Social 1080×1350 • Multi-page
19-09-2026 BREAKING NEWS 12:00 AM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మద్దతుగా కార్మికుల భారీ ర్యాలీ!

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మద్దతుగా కార్మికుల భారీ ర్యాలీ!
IMG_20260918_235630

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్‌పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ మున్సిపల్ కార్మికులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలో ర్యాలీగా తరలివచ్చిన సిబ్బంది, కార్మికులు ‘ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు.

​తనపై వస్తున్న డీజిల్ టోకెన్లు, మద్యం బాటిళ్లు, నగదు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్ స్పష్టం చేశారు. తాను నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నానని, అక్రమాలకు లొంగకపోవడంతోనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని తాను ఎప్పుడూ అనలేదని, కమిషనర్ చాంబర్‌లో ఆధారాలు చూపాలని మాత్రమే కోరానని తెలిపారు. తన వెన్నంటి నిలిచిన కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

​బాధితుల ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్):

  • సిబ్బందిపై వేధింపులు: కౌన్సిలర్ భర్త, మరొక కౌన్సిలర్ శానిటేషన్ కార్యాలయానికి వచ్చి ఫొటోలు తీస్తూ, సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
  • ఉన్నతాధికారులకు నివేదిక: ఈ ఘటనపై కలెక్టర్, ఆర్డీవో, కమిషనర్‌లతో మాట్లాడి పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
  • RTI ద్వారా సమాచారం పొందాలి: వాహనాలు, జీపీఎస్ వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా తీసుకోవాలని, ఆఫీసుకు వచ్చి సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేశారు.

​కార్మికుల సంక్షేమానికి, మున్సిపల్ ఉద్యోగుల హక్కులకు పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చైర్మన్ భరోసా ఇచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!