15-06-2024 NORMAL NEWS 09:22 AM
swarnodayam.com
Telugu Daily News
15-06-2024 09:22 AM By Mandala Yadagiri

కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని బిఆర్ఎస్వి ఫిర్యాదు.

కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని బిఆర్ఎస్వి ఫిర్యాదు.
IMG-20240615-WA0087

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కార్పొరేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని పుస్తకాల పేరుతో అధిక ధరలకు అమ్మడాన్ని అరికట్టాలని భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం (BRSV) హుజురాబాద్ టౌన్ అధ్యక్షులు విడపు అనురాగ్ అన్నారు. శనివారం ఆయన హుజురాబాద్ ఎంఈఓ కేతరి వెంకట నరసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధిక ఫిజులు వసూలు చేస్తూ, నిభందనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలను అమ్ముతున్న వారిపై చర్యలు తీసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్.ఎస్.వి నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!