18-06-2024 NORMAL NEWS 10:51 AM
swarnodayam.com
Telugu Daily News
18-06-2024 10:51 AM By Mandala Yadagiri

మా గోడు వినేది ఎవరు మా గోస తీర్చేది ఎవరు..దళిత బంధు రెండో విడత బాధితులు

మా గోడు వినేది ఎవరు మా గోస తీర్చేది ఎవరు..దళిత బంధు రెండో విడత బాధితులు
IMG-20240618-WA0053

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభించారు. సుమారుగా 17862 మందిని లబ్ధిదారులుగా గుర్థించి మొదటి విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేసింది, రెండో విడత విడుదల చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో రెండో విడత ఆగిపోయింది. ఎన్నికలు అయిపోయాక ఇస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక కూడా ఇవ్వడం లేదని ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఎవరు స్పందించక పోవడంతో దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేశామని చేసిన కూడా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్రము చేశారు.పార్లమెంట్ ఎన్నికల సమయంలో అన్ని పార్టీ తరఫున అభ్యర్థులను కలిసిన చేస్తామని చెప్పడం తప్ప ఎవరూ చేయలేదని మంగళవారం రోజున జమ్మికుంట నుంచి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టమని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధనసమితి సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, రామంచ రాకేష్, అకినపల్లి ఆకాష్, మంద వేణు, ఇనుగాలా బిక్షపతి, కోడెపాక రక్షిత్, దసరాపు నాగరాజు, రామంచ శ్రీకాంత్, గాజుల కుమార్, సరిత, జీడీ అరుణా తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!