29-06-2024 NORMAL NEWS 07:16 AM
swarnodayam.com
Telugu Daily News
29-06-2024 07:16 AM By Mandala Yadagiri

శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన దివస్ సందర్భంగా మొక్కలు నాటిన బిజెపి నేతలు

శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన దివస్ సందర్భంగా మొక్కలు నాటిన బిజెపి నేతలు
IMG-20240629-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన దివస్ ను పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చెట్టు నాటి మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నాటి నిరంకుశ కాంగ్రేస్ పాలనను అంత మొందించడానకి జన సంఘ్ ను స్థాపించి నేటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన భారతదేశం అతర్జాతీయ స్థాయికి ఎదగడనికి నాంది పలికాడన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నాను, ఇందులో భాగంగా ఈరోజు కాట్రపల్లి గ్రామంలోని రెండు బుతులలో 100 మొక్కలను నాటా మన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాముల కుమార్, జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల శ్యామ్, మండల ప్రధాన కార్యదర్శి మోడెపు వినయ్, బూత్ అధ్యక్షులు తళ్లపల్లి అనిల్, ముప్పు కోటి, గ్రామ కార్యకర్తలు పెరుమల కోటి, శ్యామ్, రఘు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!