06-07-2024 NORMAL NEWS 02:17 AM
swarnodayam.com
Telugu Daily News
06-07-2024 02:17 AM By Mandala Yadagiri

సిర్సపల్లిలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

సిర్సపల్లిలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ
IMG-20240706-WA0116

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 24 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్(రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ చక్రధర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్ చక్రధర్ మధురమ్మ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేలాగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కోయల్ కార్ దుర్గాజి విద్యార్థులు పాల్గొన్నారు.


ఈరోజు తేదీ 6 -7 -2024 శనివారం రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజరాబాద్ మండలం సిరసపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 24 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయుటకు స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ( రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ చక్రధర్ గారి చేతుల మీదుగా విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధురమ్మ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్థులు కూడా బాగా చదివి భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేలాగా ఎదగాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కోయల్ కార్ దుర్గాజి విద్యార్థులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!