Telugu Daily News
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.


