13-07-2024 NORMAL NEWS 08:16 AM
swarnodayam.com
Telugu Daily News
13-07-2024 08:16 AM By Mandala Yadagiri

రాంపూర్ వాసి కుడికాల భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం

రాంపూర్ వాసి కుడికాల భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
IMG-20240713-WA0159

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన కుడికాల భాస్కర్ కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా సామజిక సేవ విభాగంలో హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ భవనంలో శనివారం గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గత కొన్ని ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నాను. రకరకాల ప్రచారాలు చేసి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాను. నేను చేసిన కార్యక్రమాలలో మొదటిది కరోనా సమయంలో అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, వెనుకబడిన గ్రామాల్లో వైద్య శిబిరాలు, ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. మరియు అవగాహన సెషన్ నిర్వహించడం. ప్రతి సంవత్సరం వంద నుండి రెండు వందల మంది దాతలు రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఇతర రక్తదాన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలలో పాల్గొంటారు. శీతాకాలంలో సన్యాసులకు దుప్పట్లు, షీట్లు, పండ్లు మరియు ఆహారం పంపిణీ చేయడం. పట్టణ, గ్రామీణ నేత కార్మికులు, బీడీ కార్మికులు, అన్ని రంగాల కార్మికులను ఆదుకోవడంతోపాటు వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాను.
నా జీవితం సామాజిక సేవకే అంకితం. ఈ సంస్థలో అవకాశం ఇస్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తానని ఆయన చెప్పారు. కాగా భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ రావడం పట్ల గ్రామస్తులు, పద్మశాలి కుల సంఘాల, చేనేత సహకార సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!