19-07-2024 NORMAL NEWS 11:20 AM
swarnodayam.com
Telugu Daily News
19-07-2024 11:20 AM By Mandala Yadagiri

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో 11 మంది ఎస్సైల బదిలీలు.. -కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి.

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో 11 మంది ఎస్సైల బదిలీలు.. -కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి.
IMG-20240603-WA0111

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం..
టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్ శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు,
కమీషనరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న జి అనూషను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారిని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి, కమీషనరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న యూనస్ అహ్మద్ అలీని హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు, కమీషనరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న టి వివేక్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు, కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పి అభిలాష్ ను కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ రాజేష్ ను విఆర్ కరీంనగర్ కు, కమీషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న ఎన్ శ్రీనివాస్ ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కు , హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జి సాంబయ్యగౌడ్ ను సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ విఆర్ లో ఉన్న ఎస్ హనుమంతరావును పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!